మంగళగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం..కాన్వాయ్ ఆపి క్షతగాత్రులకు హెల్ప్ చేసిన మంత్రి

by Jakkula.Mamatha |   (  Updated:2024-07-14 08:45:21  IST  )

గుంటూరు జిల్లా మంళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మంగళగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం..కాన్వాయ్ ఆపి క్షతగాత్రులకు హెల్ప్ చేసిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ ఆపి ఘటన స్థలానికి వెళ్లారు. ఆమె క్షతగ్రాతులకు మంచి నీరు తాగించి..సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంతేకాదు దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. అనంతరం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.

Next Story